మహేష్ బాబుగారి ప్రశంస ఎప్పటికి మర్చిపోలేను: Suhas

by Disha Web Desk 10 |
మహేష్ బాబుగారి ప్రశంస ఎప్పటికి మర్చిపోలేను: Suhas
X

దిశ, సినిమా: యువ హీరో సుహస్ నటించిన తాజా చిత్రం 'పద్మభూషన్'. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరక్కెకిన ఈ మూవీ మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 3న అభిమానుల ముందుకు రానుంది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి ఎంతో గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో టీనా శిల్ప రాజ్ హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, రోహిణి నటించారు. ఇక తమ మూవీ ప్రమోషన్‌లో భాగంగా పలు మీడియా ఛానల్‌తో ముచ్చటించిన సుహాస్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుహాస్ మాట్లాడుతూ..'దర్శకుడు షణ్మఖ ప్రశాంత్ మూవీని చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. థియేటర్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ చూసి ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన ట్వీట్‌తో మా చిత్ర టీమ్‌ను విష్ చేయడం నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. అప్పట్లో ఆయన నటించిన 'పోకిరి' మూవీ టికెట్ కోసం థియేటర్ లైన్ నిలబడి బట్టలు చించుకున్న రోజులున్నాయి. అలాంటి సూపర్ స్టార్ నా సినిమాకి ట్వీట్ చేయడం ఎంతో గొప్ప విషయం. ఇప్పటికే ఆయనకు నేను పెద్ద అభిమానిని. అలాగే ఆరాధిస్తూ ఉంటాను' అన్నాడు.

Also Read...

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న '18 Pages'!

'Pathaan' చూసి రివ్యూ ఇచ్చిన హృతిక్ రోషన్


Next Story

Most Viewed